శనివారం, ఏప్రిల్ 25, 2020

మన పక్కనే జరిగినా మనకి తెలియనిజలియన్‌వాలా బాగ్-విదురశ్వత్థ





జలియన్ వాలాబాగ్, భారత స్వతంత్ర పోరాట చరిత్రలో మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకం. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ పట్టణంలోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో సమావేశమయ్యి, సభ నిర్వహించుకుంటున్న స్వాతంత్ర ఉద్యమకారులని చుట్టుముట్టి, ఏవిధమైన warning లేకుండా జనరల్ డయ్యర్ ఒక్కసారిగా firingచేసి అనేకమంది మరణానికి కారణమయ్యాడు. దాని గురించి మనలో చాలామందికి తెలుసు.
కానీ దక్షిణ భారతదేశంలో మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే తరహా సంఘటన జరిగిందని, దానికి ఇవాళ్టితో  82 సంవత్సరాలు నిండాయని మనలో చాలా మందికి తెలీదు. అలా మనెవ్వరికీ తెలియకుండ మరుగున పడిపోయిన దక్షిణ భారత జలియన్ వాలాబాగ్ దుర్ఘట్న గురించి ఇవాళ తెలిసుకుందాం. యాదృశ్చికంగా రెండు సంఘటనలూ ఏప్రెల్ నెలలోనే జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటక లో  ఒకప్పుడు గౌరీబిదనూరు జిల్లాలో  ఉన్న విదురశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న ఈ విషాదం చోటుచేసుకుంది.  విదురశ్వత్థ పెన్నేరు నది ఒడ్డున ఉండే ఒక ప్రశాంతమైన గ్రామం.