పుస్తకాల పరిచయం,విశ్లేషణ కోసం మా Youtube చానెల్ Subscribe అవ్వండి
శనివారం, ఆగస్టు 01, 2020
ఆదివారం, ఏప్రిల్ 26, 2020
LockdownL: కరోనా టైంలో కొత్తవిషయాలు నేర్చుకుందాం
Lockdown: #carona దెబ్బకి నెలరోజుల పైనుండీ ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోందా? చ, వెధవ కరోనా దీనివల్ల నా పనంతా పాడైపోతోంది అనిపిస్తోందా? నిజమే, కరోనా దెబ్బకి అందరి పనులూ ఆగిపోయాయి. దేశం అంతా #Lockdown అయిపోయింది. కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళ కూడదు. ప్రభుత్వం చెబుతున్నట్లు, ఇంకో 15 రోజుల్లో అంతా సెట్ ఐపోతుందనే అనుకుందాం. కానీ, ఒకవేళ #Lockdown Extend అయ్యి, ఇంకొన్నిరోజులు ఇలాగే గడపాల్సిన పరిస్థితి వస్తే, మనకి అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోడానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి వద్దాం అనుకుంటున్న దశలోఉన్న #Students. సో, దొరికిన ఈ టైం ని ఉపయోగించుకుంటూ ఏమేం చెయ్యాచ్చో ఈ వీడీయోలో డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం ఇదేదో నా పర్శనల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోడానికో, లేదా మార్కేటింగ్ jobs కి మిమ్మల్ని attract చెయ్యడానికో చేస్తున్న వీడీయో అయితే కాదు. జస్ట్ కాజువల్ డిస్కషన్ అంతే.
ఈ వీడీయో కనుక మీకు నచ్చితే, నా చానెల్ కి Subscribe అవ్వండి. దాని వల్ల్ మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడనికి నాకు వీలవుతుంది.
Subscribe అవ్వడానికి లింక్ క్రింద ఇచ్చాను
Channel Link
https://www.youtube.com/watch?v=gfh4uyn-sPM
ఆర్యభట్ట చెప్పిన π విలువ - Sailorbook
హాయ్ ఫ్రెండ్స్, మన పూర్వీకులలో π విలువను వివిధ దేశాలకు చెందిన గణిత శాస్త్రవేత్తలు చాలామందే చెప్పారు. కానీ వారంతా కొన్ని దశాంశాలవరకే చెప్పగలిగారు. కానీ దాని విలువను 31 దశాంశాలవరకూ ఖచ్చితంగా గణించి చెప్పినవాడు మన ప్రాచీనుడైన ఆర్యభట్ట. ఏసాంకేతిక విజ్ఞానమూ అందుబాటులో లేని ఆకాలంలోనే అంటే 4వ శతాబ్ధంలోనే ఆర్యభట్ట 31దశాంశాలవరకూ గణించగలిగాడు. అదేసమయంలో π విలువను కృష్ణుని ప్రార్ధిస్తున్నట్లుగా ఉండే ఒక సంస్కృత శ్లోకరూపంలో వ్య్క్తపరిచాడాం ఆర్యభట్ట ప్రత్యేకత. ఆశ్లోకం దానిలో ఉన్న మార్మిక అర్ధం ఈ క్రింది వీడిలోయో ఇచ్చాను చూడండి, అలాగే నా చానెల్ ఇప్పటివరకూ సబ్స్క్రైబ్ అవ్వనివారు ఎవరెన ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరి ప్రోతాహంతో మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
https://www.youtube.com/watch?v=Y57SsLQTxBw&t=26s
శనివారం, ఏప్రిల్ 25, 2020
మన పక్కనే జరిగినా మనకి తెలియనిజలియన్వాలా బాగ్-విదురశ్వత్థ
జలియన్ వాలాబాగ్, భారత స్వతంత్ర పోరాట చరిత్రలో మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకం. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ పట్టణంలోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో సమావేశమయ్యి, సభ నిర్వహించుకుంటున్న స్వాతంత్ర ఉద్యమకారులని చుట్టుముట్టి, ఏవిధమైన warning లేకుండా జనరల్ డయ్యర్ ఒక్కసారిగా firingచేసి అనేకమంది మరణానికి కారణమయ్యాడు. దాని గురించి మనలో చాలామందికి తెలుసు.
కానీ దక్షిణ భారతదేశంలో మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే తరహా సంఘటన జరిగిందని, దానికి ఇవాళ్టితో 82 సంవత్సరాలు నిండాయని మనలో చాలా మందికి తెలీదు. అలా మనెవ్వరికీ తెలియకుండ మరుగున పడిపోయిన దక్షిణ భారత జలియన్ వాలాబాగ్ దుర్ఘట్న గురించి ఇవాళ తెలిసుకుందాం. యాదృశ్చికంగా రెండు సంఘటనలూ ఏప్రెల్ నెలలోనే జరిగాయి.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటక లో ఒకప్పుడు గౌరీబిదనూరు జిల్లాలో ఉన్న విదురశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న ఈ విషాదం చోటుచేసుకుంది. విదురశ్వత్థ పెన్నేరు నది ఒడ్డున ఉండే ఒక ప్రశాంతమైన గ్రామం.
మంగళవారం, ఏప్రిల్ 14, 2020
స్వాతంత్రోద్యమంలో సంఘ్ పరివార్ (RSS) పాత్ర ఏమీలేదా?
(హాయ్ అండి, ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), అందరికీ పనికివచ్చే విషయాలమీద వీడీయోస్ చేస్తున్నాను.
ఈ చానెల్ నేను భారతీయ మేధావుల గొప్పదనం, ఇంకా హిస్టరీ గురించి నాకు తెలిసినవిషయాలు చెప్పడానికి ప్రారంభించాను.
మీరందరూ నాచానెల్ కి సబ్స్క్రైబ్ చేసి, వీడీయో చూసి, మీ ఫీడ్-బాక్ నాకు తెలియజెయ్యండి. ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ మరిన్న్ని మంచి వీడీయోలు చేస్తాను.
మీ అందరూ సహకరిస్తే, పూర్తిగా డెడికేటెడ్ గా ఇటువంటి వీడీయోలు మరిన్ని చేయ్యాలనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది).
స్వాతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఏమీలేదా? నిజానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న. దేశభక్తులతో నిండిన ఒక సంస్థ,మనసా,వాచా దేశాన్ని తల్లిగా చూసే సేవకులున్న ఒక NGO, ఆ దేశస్వాత్రంత్రంకోసం జరుగుతున్న అత్యున్నతస్థాయిపోరాటంలో పాల్గొనకుండా ఉందా?
ఇది ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం. ఎందుకంటే సోషల్ మీడీయా యుగంలో ఉన్నమనకి నిజమేదో, అబద్దమేదో అలోచించి, పరిశోధించి తెలుసుకునే శక్తి రోజురోజుకీ తగ్గిపోతోంది.
ఇది నిజంగా బాధపడవలసిన విషయం. ఎందుకంటే, అలోచించలేని మనుషులు ఉన్న చోట, నకిలీ వార్తలు పేట్రేగిపోతాయి. అలా ఈ విషయం కూడా కొంతమంది నకిలీగాళ్ళకి తమ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యడానికి ఉపయోగపడుతోంది. ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్ లొ ఒక వీడీయోనో, సోషల్-మీడీయాలో ఒక పోస్టో పెడతారు. ముందు వెనక చూసికోకుండా దానిని చూసినవారందరూ షేర్ చేసేస్తారు. దానివల్ల తప్పుడుసమాచారం ప్రజలందరికీ చేరిపోతోంది.
అలా సోషల్ మీడీయాలో విసృతంగా ఉన్న ఒక తప్పుడు ప్రచారం, స్వాతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఎమీలేదని. ఇప్పుడుమనం అందులో ఉన్న సమాచారంతో నిజానిజాలు తెలుసుకుంటే, స్వాతంత్రపోరాటంలో ఆర్.ఎస్.ఎస్ ఎటువంటి పాత్రపోషించిందో మనకి అర్ధమౌతుంది
1921 వ సంవత్సరం కేరళలోని మలబార్ తీరంలో మోప్లారైతుల తిరుగుబాటు జరిగింది. దానికి కాంగ్రేస్ మద్దతు ఇచ్చింది. ఆ రైతుల ఉద్యంలోకి కొందరు మతోన్మాదులు చేరి ఉద్యమాన్ని హింసాత్మకం చేసేశారు. దానిలో ఎందరో హిందువులు దారుణమైన ఊచకోతకు గురయ్యారు.
ఆ ఉద్యమం పరిధులు దాటి హింసాత్మక రూపం దాల్చడంతో కాంగ్రేస్ దానినుండీ బయటకి వచ్చేసింది. ఇంతజరిగినా, హిందువులను ఊచకోత కోసిన మతోన్మాదులపై ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
ఈ విషయాలన్నీ మనసులో ఉండడంతో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ గారు హిందువులకి రక్షణగా ఉండడంకోసం 1925 లో RSSను స్థాపించారు. అప్పటికే హెడ్గేవర్ గారు స్వాతంత్రపోరాటంలో చురుకుగా పాల్గొంటున్నారు. తనే ఒక సంస్థను స్థాపించినా, పోరాటంలో ఆయన చాలాకాలం కాంగ్రేస్తో కలిసే నడిచారు.
డా.హెడ్గేవార్ స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త. లోకమాన్య తిలక్ వంటి గొప్ప నాయకులతో కలిసి చాలాకాలం పనిచేశారు. విప్లవ కార్యకలాపాలలో పాల్గొని 1921లో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు కూడా. ఆ సందర్భంగా సాగిన కోర్టు విచారణలో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి గట్టిగా వాదించడమే కాక తన చర్యలను సమర్ధించుకున్నారు.
RSS:భారతీయ జీవనవిధాన ప్రతినిధి- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)
(హాయ్ అండి, ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), అందరికీ పనికివచ్చే విషయాలమీద వీడీయోస్ చేస్తున్నాను.
ఈ చానెల్ నేను భారతీయ మేధావుల గొప్పదనం, ఇంకా హిస్టరీ గురించి నాకు తెలిసినవిషయాలు చెప్పడానికి ప్రారంభించాను.
మీరందరూ నాచానెల్ కి సబ్స్క్రైబ్ చేసి, వీడీయో చూసి, మీ ఫీడ్-బాక్ నాకు తెలియజెయ్యండి. ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ మరిన్న్ని మంచి వీడీయోలు చేస్తాను.
మీ అందరూ సహకరిస్తే, పూర్తిగా డెడికేటెడ్ గా ఇటువంటి వీడీయోలు మరిన్ని చేయ్యాలనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సంక్షిప్తంగా ఆర్ ఎస్ ఎస్. అణువణువునా దేశభక్తి నిండిన కోట్లమంది కార్యకర్తల బలం ఉన్న ఒక సాంస్కృతిక సంస్థ. దేశభక్తిని ప్రచారం చెయ్యడంలోనూ, అనికోని విపత్తులు వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయాల్లోనూ, నేనున్నానంటూ ముందుకువచ్చి బాధితులకి అండగానిలబడుతూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది.
ఈ సంస్థలో, అతిసాధారణ వ్యక్తులుంటారు, పెద్దపెద్ద ఇంజనీర్లు,డాక్టర్లు, గొప్ప గొప్ప మేధావులుంటారు. ప్రపంచమంతా పేరున్న రాజకీయనాయకులుంటారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వీరంతా కలిసి భారతదేశ అభివృద్ధి కోసం తమకు అప్పగించబడిన పనిని మౌనంగా చేసుకునిపోతూ ఉంటారు.
వ్యక్తిగా వారు ఎంతగొప్పవారైనా కావచ్చు, కానీ ఆర్ ఎస్ ఎస్ దృష్టిలో వారంతా కార్యకర్తలు మాత్రమే. ఒక్కసారి ఆ సంస్థ కార్యాలయంలోకి అడుగుపెడితే కులం,పేదా,ధనిక,చిన్నా,పెద్దా లాంటి భావనలు పక్కకి పెట్టి ఖాకీ నిక్కరు తొడుక్కుని క్రమశిక్షణతో మెలగాల్సిందే.
వందసంవత్సరాల వ్యవస్థాపక మహోత్సవానికి ఎంతో దగ్గరలోఉన్న ఆర్ ఎస్ ఎస్, తన జీవితకాలంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. అన్యాయంగా తనపై 2 సార్లు నిందవేసి నిషేధానికి గురిచేసినా, ప్రజల నమ్మకాన్ని కోల్పోలేదు. ఎప్పటికప్పుడు తన నిజాయితీని ప్రూవ్ చేసుకుంటూ తన లక్ష్యంవైపు సాగిపోతోంది..
అభిమానులంతా సంఘ్ పరివార్ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. అదేసమయంలో ప్రత్యర్ధులు చెడ్డీ గ్యాంగ్, మతోన్మాదులగుంపు అని విమర్శిస్తూ తమ నోటి కండూతిని తీర్చుకుంటూ ఉంటారు. ఎవరు ఏమైనా అననీ RSS మాత్రం పొగడ్తలకి పొంగిపోదు, పనికిమాలిన విమర్శలను పట్టించుకోదు. మౌనంగా తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది.
అది 1897, జూన్ 22. ఆ రోజు విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం భారతదేశంలోకూడా ఎంతో ఘనంగా జరుగుతోంది. కానీ దీనిపై ఒక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు.పాఠశాలలో జరిగిన వేడుకలలో పాల్గొనకుండా ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చి, పుస్తకాలు పక్కన పడేసి, ఓ మూలన కూర్చున్నాడు.
ఆ బాలుణ్ని చూసి సోదరుడు, వేడుకల్లో నువ్వు పాల్గొనట్లేదా? అని ప్రశ్నించాడు.
''లేదు, మన సంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటీష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం?'' అని ప్రశ్నించాడు ఆ బాలుడు. ఆ బాలుడే RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్
గురువారం, ఏప్రిల్ 02, 2020
గురువారం, మార్చి 26, 2020
ట్రాయ్ యుద్ధం -Trojan war - Part2
మొదటిపార్టులో, యుద్దం మొదలవ్వకముందు, గ్రీకులు ఇథాకా రాజు ఒడిస్సియస్తో ట్రోజన్లకి శాంతి సందేశం పంపారని చెప్పాను కదా, కానీ ఆ ప్రతిపాదనని ప్రయాం తిరస్కరించడంతో, ఒడిస్సియస్ ఇంకొక ప్రతిపాదన చేస్తాడు.
పారిస్, మెనెలేయస్ వీరిద్దరి వల్లే ఇంత యుద్ధం జరిగేలాఉంది కనుక, వాళ్ళిద్దరికీ 1 టు 1 ఫైట్ పెడదాం, అందులో ఎవరు గెలిస్తే వారికే హెలెన్ సొంతం అన్నాడు. ఈ ప్రతిపాదనకి ప్రయాం అంగీకరించాడు.
కానీ పశువుల కాపరి ఇంట్లో పెరిగిన పారిస్ కు యుద్ధ విద్యల్లో పెద్దగా ప్రావీణ్యం ఉండదు.. అతణ్ని మెనెలేయస్ ఈజీగా ఓడిస్తాడని అంతా అనుకున్నారు. తాను ఓడిపోతే హెలెన్ దక్కదన్న సంగతి పారిస్ కు తెలుసు.
అందుకే మెనెలేయస్ తో వన్ టూ వన్ పోరాటంలో గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ అతడి చేతిలో తీవ్రంగా గాయపడి క్రిందపడిపోయాడు. పారిస్ చనిపోయాడా లేదా అన్నది నిర్ధారించుకోకుండానే మెనెలేయస్ యుద్ధం ముగిసిందని ప్రకటిస్తాడు.
కానీ కొన ఊపరితో ఉన్న పారిస్ తిరిగి లేస్తాడు. కానీ అప్పటికే చీకటి కావడంతో పోటీ అక్కడితో ముగుస్తుంది. అలా ఆ 1 టూ 1 పోరాటం ఫలితాన్ని ఇవ్వకుండానే ముగుస్తుంది. తర్వాత రోజు గ్రీకులకు, ట్రోజన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది.
ఈ పరిణామాలను చూసి మెనెలేయస్ సంతోషించాడు. ఎందుకంటే అతను యుద్ధం కొనసాగాలనే కోరుకున్నాడు,కారణం అతడి లక్ష్యం హెలెన్ మాత్రమే కాదు. ట్రాయ్ ను సర్వనాశనం చేయడం.
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
ట్రాయ్ యుద్ధం -Trojan war - Part2
భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయం
ఫ్రెండ్స్ గో ఆధారిత వ్యవసాయం గురించి ఒక వీడియో చేశాను. చూసి మీకు నచ్చినట్లయితే, నా చానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి.
భారతీయ జీవన విధానంలో ఆవును ఒకజంతువుగా మాత్రమే కాక కుటుంబంలో ఒక భాగంగా చూస్తారు. అందుకే, వట్టిపోయిన ఆవుకి ఎండుగడ్డయినా పెట్టి మేపుతారు గానీ, వదులుకోరు. కానీ రాను రాను డబ్బు మానవజీవితంలో ప్రతీ బంధాన్నీ ప్రభావితం చెయ్యడంతో పశుపోషణ కూడా పూర్తిస్థాయి వాణిజ్యరూపానికి మారిపోయింది.
దానితో రైతుకు పశువుతో ఉండే సున్నితమైన సంబంధంకూడా దెబ్బతుంటోంది. పాలుఇచ్చినంతవరకే పశువులని మేపుతూ, అవి వట్టిపోయాక దళారులచేతుల్లో పెట్టి వదిలించుకుంటున్నారు. అవి అక్కడినుంచీ కబేళాలకి చేరుకుంటున్నాయి.
ఇలా పశువులను కబేళాలకు తరలించడాన్ని చాలామంది సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.కానీ, ఇలా వట్టిపోయిన ఆవుల్ని వదిలించుకోవడాన్ని, ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా విమర్శించలేం. ఎందుకంటే ఇందులో రైతుల్ని తప్పు పట్టడానికికూడా ఏమీలేదు, ఇదివరకటి రోజుల్లో, పశువులని ఊరిబయట పచ్చిక మైదనాలలో విడిచిపెట్టి మేపేవారు.
కానీ ఇప్పుడు రియల్ ఏస్టేటు పుణ్యమా అని, పల్లెల్లోకూడా గడ్డి లభ్యత తగ్గిపోయింది. ప్రతీరోజూ డబ్బుపెట్టి గడ్డి కొని పశువుని పోషించడం చిన్న రైతులకి సాధయమయ్యే పనికాదు. అందుకే రైతులుకూడా పశువులని దళారులచేతుల్లోపేట్టెస్తున్నారు.
కనుక వట్టిపోయిన పశువుని వదిలించుకోవడం తప్పు అనిభావించేవారు, ఆ పశువు ద్వారా రైతుపై పడే భారాన్ని తగ్గించుకోవడానికి ఏంచెయ్యాలో కూడా సూచించవలసి ఉంటుంది. లేకపోతే రైతు ఆర్ధికంగా కుదేలయ్యే అవకాశం ఉంది.
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయం
సోమవారం, మార్చి 23, 2020
కరోనా ఇది చైనా సృష్టించిన భూతమా?
కరోనా,కరోనా,కరోనా కరీనా మాత్రమే తెలిసిన మనకి సరిగ్గా రెండునెలల క్రితం పరిచయమయ్యిందీ కరోనా. మొదట విన్నప్పుడు ఆ ఎక్కడో చైనాలోపుట్టింది , మనకేమవ్తుందిలే అనిపించింది అందరికీ. వారం రోజుల క్రితం వరకూ చైనాలో ఇంతమంది చనిపోయారు, ఇటలీలో పరిస్థితి ఇలాఉంది అంటుంటే, ఆ మనవరకూ ఏం రాదులే, ఏంకాదులే అని ధైర్యంగానే అనిపించింది.
కొన్ని రోజుల క్రితం సినిమా హీరోలు రాంచరణ్, ఎంటీఅర్ లు ఇద్దరూ కలిసి కరోనాతో జాగ్రత్తగా ఉండండి అంటూ వీడీయోలు రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మూవీ ఎదో చేస్తున్నారుకదా, ప్రచారంకోసం ఆ అకేషన్ని వాడేసుకుంటున్నారేమో అనిపించింది.
కానీ రెండురోజుల నుండీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే నిజంగానే భయంవేస్తోంది. కరోనా విశ్వరూపం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది.
అసలు ఈ కరోనా మనజీవితాల్లోకి ఎలా వచ్చింది అంటే వాడెవడో చైనావాడు అడ్డమైన చెత్తా తిని గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్ను వాడికంటించుకోవడామేకాక, మొత్తం ప్రపంచం మీదకే వదిలాడంటున్నారు.
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
కొన్ని రోజుల క్రితం సినిమా హీరోలు రాంచరణ్, ఎంటీఅర్ లు ఇద్దరూ కలిసి కరోనాతో జాగ్రత్తగా ఉండండి అంటూ వీడీయోలు రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మూవీ ఎదో చేస్తున్నారుకదా, ప్రచారంకోసం ఆ అకేషన్ని వాడేసుకుంటున్నారేమో అనిపించింది.
కానీ రెండురోజుల నుండీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే నిజంగానే భయంవేస్తోంది. కరోనా విశ్వరూపం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది.
అసలు ఈ కరోనా మనజీవితాల్లోకి ఎలా వచ్చింది అంటే వాడెవడో చైనావాడు అడ్డమైన చెత్తా తిని గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్ను వాడికంటించుకోవడామేకాక, మొత్తం ప్రపంచం మీదకే వదిలాడంటున్నారు.
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
కరోనా ఇది చైనా సృష్టించిన భూతమా?
ఆదివారం, మార్చి 22, 2020
మహాభారత యుద్ధానికి ఇంచుమించు సరిసమానమైన ట్రాయ్ యుద్ధం
హెలెన్ ఒక గ్రీకు రాజకుమారి, చూపుతిప్పుకోలేనంత గొప్ప అందం ఆమెసొంతం. అందంలో చుట్టుపక్కల రాజ్యాలలో ఆమెకు ఎదురు రాగలిగినవాళ్ళేలేరు. ఆమెకు ఇష్టం ఉందో లేదో తెలియని స్థితిలో స్పార్టా రాజు మెనెలేయస్ ని పెళ్ళిచేసుకుంటుంది. ఒకరోజు ట్రాయ్ యువరాజు పారిస్ ఆదేశానికి రాయబారిగా వచ్చాడు.
రాజు భార్య అయిన హెలెన్ ని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెది కూడా అదేపరిస్థితి. అదేశమయంలో మెనె లేయస్ ఒక రాచకార్యం నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్ళడం వీరికి కలిసివచ్చింది. ఇద్దరూ అక్కడినుండీ పారిపోయి ట్రాయ్ రాజ్యానికి వెళ్ళిపోయారు.
తిరిగివచ్చిన మెనెలేయస్ , తనకు జరిగిన ద్రోహం తెలిసి రగిలిపోయాడు. చుట్టుపక్కల గ్రీకు రాజ్యాలన్నింటిక్నీ కలుపుకుని తనభార్యను ఎత్తుకెళ్ళిన ట్రాయ్ రాజ్యం మీద యుద్దం ప్రకటించాడు. మెనెలేయస్ కి జరిగిన అవమానాన్ని గ్రీకులందరూ తమకు జరిగిన అవమానంగా భావించారు.
వందలకొద్దీ యుద్ధనౌకలతో మెనెలేయస్ కి తోడునిలబడి ట్రాయ్ మీద యుద్ధం చేశారు. ఆ యుద్దం దాదాపు 10 సంవత్సరాలు జరిగింది. చివరికి మెనెలేయస్సే గెలిచాడు. తన భార్య హెలెన్ ను తిరిగి తెచ్చుకున్నాడు. కానీ ఇరువైపులా అపార ధన, ఆస్థి నస్ఠం జరిగింది. ఇది క్లుప్తం గా ట్రోజన్ యుద్ధం చరిత్ర.
అందాలరాశికోసం జరిగిన ఆ యుద్ధం కాలక్రమంలో జానపదుల నోళ్ళలో పడి అందమైన ప్రేమ కధగా మారిపోయింది. అనేకమంది కళకారులు ఆ కధను గానం చేశారు. తరాలు మారుతున్నకొద్దీ ఆ యుద్దం, దాని చరిత్ర గ్రీకు పురాణగాధల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
మహాభారత యుద్ధానికి ఇంచుమించు సరిసమానమైన ట్రాయ్ యుద్ధం
శుక్రవారం, మార్చి 20, 2020
నిర్భయ కేసులో ఏపీ సింగ్ పాత్ర
నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు. ఉదయాన్నేలేవగానే వినిపించిన వార్త.
ఒక వ్యక్తి మరణిస్తే, ఆవ్యక్తి మనకి తెలిసినా తెలియకపోయినా బాధపడతాం. కానీ నిర్భయ దోషుల మరణంకోసం దేశంలో మెజారిటీ ప్రజలు ఎదురుచూశారు. కారణం వారు చేసిన ఘాతుకం
నిర్భయ, భారతీయులెవ్వరికీ పరిచయం అక్కర్లేనిపేరు. చరిత్ర క్లుప్తంగా చెప్పాలంటే, 7 సంవత్సరాలక్రితం కదులుతున్న బస్సులో ఒక పారామెడికల్ విద్యార్ధినిని 6 యువకులు అత్యాచారంచేసి, అమెని ఆమెతోపాటు ఉన్న ఆమె స్నేహితుడిని దారుణంగా గాయపరిచి, ఢిల్లీలో గజగజ వణికించే చలిలో రోడ్డుమీదపడేసి వెళ్ళిపోయారు.
ఈ ఆరుగురిలో ఒకడు మైనర్ కావడంతో 3 సంవత్సరాల శిక్షతో సులభంగా తప్పించుకోగలిగాడు. మిగిలిన ఐదుగురిలో ఒకడు జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు సుదీర్ఘ విచారణ తరువాత ఉరికంబం ఎక్కారు.
ఇది అందరిఈ తెలిసిన చరిత్రే. కొత్తగా ఇందులోచెప్పుకునే ఏమీలేదు. ఈ కేసుతీవ్రతకి దేశమ్మొత్తం చలించిపోయింది. ప్రజలలో వచ్చిన అలజడి నిర్భయచట్టం రూపకల్పనకి దారితీసింది.
ప్రాధమికంగా లభించిన ఆధారాలన్నీ నిందితులేదోషులని స్పష్టంగా నిరూపించాయి. ఆ సమయంలో రంగప్రవేశంచేశాడు లాయర్ ఏపి సింగ్. నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుంటూ బాధితురాలినే విమర్శిస్తూ "అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే ఇలాంటి కూతురే గనక నాకు ఉంటే నేనే పెట్రోల్ పోసి చంపేవాడిని " అంటూ ఆయనచేసిన వ్యాఖ్య అందరికీ ఆశ్చర్యాన్ని,కోపాన్ని కలిగించింది.
సమాజంలో మేధావి వర్గం అని ఒక బ్యాచ్ ఉంటారు. ఏదయినా దారుణంజరిగినప్పుడు నిందితులవైపు నుండీ అలోచిస్తూ, వారు ఆ దారుణానికి పాల్పడడనికి కారణం ఏమై ఉంటుందా అని అలోచిస్తూ ఉంటారు. అటువంటివారి వాదనలు ఈ లాయరుగారికి బలాన్నిచ్చాయి.
నిదితుల వైపు న్యాయం ఎంతమాత్రం లేదని ఈయనకు కూడా తెలుసు. ఇటువంటి దోషులతరపున ఎందుకు వాదిస్తున్నావ్ అని ఎవరైనా అడిగితే, దోషులలో ఒకడైన ముఖేష్ కి 3 నెలల పాప ఉంది, ఆమెను చూసి జాలివేసి ఈకేసు ఒప్పుకున్నాను అన్నాడు. మరి చనిపోయిన వారి తల్లితండ్రుల క్షోభ మాటేంటి అని ఎవరైనా అడిగితే, వీరందరికీ ఉరి విధిస్తే దేశంలో రేపులు,మర్డర్లు తగ్గిపోతాయా అంటూ వితండవాదంచేశాడు.
అరోజుమొదలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగం గా ఘనత వహించిన భారతరాజ్యాంగానికి ప్రాణప్రదమైన న్యాయవ్యవస్తతో 7 సంవత్సరాలుగా ఆయన ఫుట్-బాల్ ఆడుకున్నాడు.
దోషులకి ఉరిశిక్ష తప్పించడమే తన లక్షం అని ప్రకటించాడు. అలాఅని ఆయన ఉరి శిక్ష వ్యతిరేక ఉద్యమకారుడో, గొప్ప ప్రజాహక్కుల పోరాటయోధుడో కాదు. కేవలం ఒక లాయర్. తన కుటిల లాజిక్కులతో భారతన్యాయ వ్యవస్థ లో ఉన్న లోపాలను తన క్లైంట్లకు అనుకూలంగా మలుచుకుంటూ వారిని కాపాడుకుంటూ వచ్చాడు.
పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి
నిర్భయ కేసులో ఏపీ సింగ్ పాత్ర
సోమవారం, మార్చి 02, 2020
వాస్కో ద గామా
వాస్కో ద గామా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సక్స్క్రైబ్ అవ్వండి.
ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సక్స్క్రైబ్ అవ్వండి.
పవర్ పాయింట్ ఉపయోగించి యానిమేషన్ చెయ్యడం ఎలా?
పవర్ పాయింట్ ఉపయోగించి యానిమేషన్ చెయ్యడం గురించి ఈ వీడియో లో తెలుసుకుందాం.
ఈ వీడియో చూసి మీకునచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి.
మంగళవారం, ఫిబ్రవరి 18, 2020
ప్రళయ కావేరి - My youtube channel TheSailor
యూట్యుబ్ లో నాకొత్త వీడియో ప్రళయ కావేరి.
చూసి ఎలా ఉందో చెప్పండి
https://www.youtube.com/watch?v=scWBEhuYGsg&t=166s
చూసి ఎలా ఉందో చెప్పండి
https://www.youtube.com/watch?v=scWBEhuYGsg&t=166s
సోమవారం, ఫిబ్రవరి 17, 2020
ఒట్టో వాన్ బిస్మార్క్ పార్ట్-1
ఒట్టో వాన్ బిస్మార్క్ పార్ట్-1
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)