మొదటిపార్టులో, యుద్దం మొదలవ్వకముందు, గ్రీకులు ఇథాకా రాజు ఒడిస్సియస్తో ట్రోజన్లకి శాంతి సందేశం పంపారని చెప్పాను కదా, కానీ ఆ ప్రతిపాదనని ప్రయాం తిరస్కరించడంతో, ఒడిస్సియస్ ఇంకొక ప్రతిపాదన చేస్తాడు.
పారిస్, మెనెలేయస్ వీరిద్దరి వల్లే ఇంత యుద్ధం జరిగేలాఉంది కనుక, వాళ్ళిద్దరికీ 1 టు 1 ఫైట్ పెడదాం, అందులో ఎవరు గెలిస్తే వారికే హెలెన్ సొంతం అన్నాడు. ఈ ప్రతిపాదనకి ప్రయాం అంగీకరించాడు.
కానీ పశువుల కాపరి ఇంట్లో పెరిగిన పారిస్ కు యుద్ధ విద్యల్లో పెద్దగా ప్రావీణ్యం ఉండదు.. అతణ్ని మెనెలేయస్ ఈజీగా ఓడిస్తాడని అంతా అనుకున్నారు. తాను ఓడిపోతే హెలెన్ దక్కదన్న సంగతి పారిస్ కు తెలుసు.
అందుకే మెనెలేయస్ తో వన్ టూ వన్ పోరాటంలో గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ అతడి చేతిలో తీవ్రంగా గాయపడి క్రిందపడిపోయాడు. పారిస్ చనిపోయాడా లేదా అన్నది నిర్ధారించుకోకుండానే మెనెలేయస్ యుద్ధం ముగిసిందని ప్రకటిస్తాడు.
కానీ కొన ఊపరితో ఉన్న పారిస్ తిరిగి లేస్తాడు. కానీ అప్పటికే చీకటి కావడంతో పోటీ అక్కడితో ముగుస్తుంది. అలా ఆ 1 టూ 1 పోరాటం ఫలితాన్ని ఇవ్వకుండానే ముగుస్తుంది. తర్వాత రోజు గ్రీకులకు, ట్రోజన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది.
ఈ పరిణామాలను చూసి మెనెలేయస్ సంతోషించాడు. ఎందుకంటే అతను యుద్ధం కొనసాగాలనే కోరుకున్నాడు,కారణం అతడి లక్ష్యం హెలెన్ మాత్రమే కాదు. ట్రాయ్ ను సర్వనాశనం చేయడం.
వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి